అధికారులు కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు
కిందిస్థాయి ఉద్యోగులను వేధించకండి
ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఉద్యమంలో పనిచేసా..
మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 7 : ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించడం గొప్ప అదృష్టమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. అందుకే అధికారులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజల్లో గు ర్తింపు లభిస్తుందని చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎదిర శివారులో ఉన్న ప్రభుత్వ మె డికల్ కళాశాలలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలో అధికారి గా విధుల్లో కొనసాగుతూనే ఎప్పుడూ ప్రజలకు ఇబ్బందులకు లేకుండా చూసే వాడినని గుర్తు చేశారు. అటు ఉద్యోగానికి న్యాయం చేస్తూ.. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నానని చెప్పా రు. ఉద్యమ సమయంలో చిన్నపాపకు డెంగీ జ్వరం వచ్చిందని.. సీరియస్గా ఉందని డాక్టర్ చెబితే రాత్రి 1:30 గంటలకు ఇంటికెళ్లి తన కూతురుని చూసి మళ్లీ తెల్లవారుజామునే తెలంగాణ కో సం ఆత్మహత్య చేసుకున్న అమరుడి కోసం వెళ్లి పోరాటం చేశానన్నారు. జిల్లా అధికారులు కూడా కష్టపడి పనిచేయాలని, అప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందని చెప్పారు. ఇందుకోసం శక్తివంచన మేరకు కృషి చేయాలని సూచించారు. పేదలకు సాయం చేయాలన్న తపనతో పనిచేయాలని కోరా రు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్య, మరిన్ని శాఖలు వారికి అప్పగించిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్చర్ల-మహబూబ్నగర్ నాలుగు లేన్ల రహదారికి ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలని డీఎఫ్వోకు సూచించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని రహదారులపై, బైపాస్, ఇతర రో డ్లకు ఇరువైపులా రెండు, మూడు వరుసల్లో మొ క్కలు నాటాలన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని రోడ్ల వద్ద మొక్కలు నాటాలని ఆదేశించారు. వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. మైనార్టీ సంక్షేమంలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.120 కోట్లతో ఆరు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలన్నింటినీ ఒకే ప్రాంగణంలో నిర్మిస్తున్నామని, పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి ప్రజలు వచ్చే లా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించాలని, అవసరమైతే బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే గుడ్లు, ఇతర పౌష్టికాహారంలో నాణ్యత లో పించకుండా చూడాలన్నారు. గుడ్లు పెద్ద సైజులో, కందిపప్పు మంచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారిని ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులను అధికారులు వేధించవద్దని సూచించారు. ఉద్యోగుల బదిలీల సక్రమంగా, దూద్ దవాఖానను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకుగానూ అమెరికన్ యూనివర్సిటీ నుంచి మంత్రికి డాక్టరేట్ రాగా శ్రీనివాస్గౌడ్ను కలెక్టర్ వెంకట్రా వు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్పవార్, సీతారామారావు, డీఆర్ఏ స్వ ర్ణలత, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డీఎంహెచ్వో కృష్ణ, డీఈవో ఉషారాణి, జిల్లా అగ్రికల్చరల్ అధికారి సుచరిత, ఆర్డీవో, డీఎస్వో వనజాత, జెడ్పీ సీఈవో, జిల్లా కోఆపరేటివ్ అధికారి టైటాస్ పాల్, డాక్టర్లు శశికాంత్, రఫిక్, శంకర్, కిరణ్ ప్రకాశ్ ఘనంగా సన్మానించారు.
బయోరాడ్ ఆర్టీపీసీఆర్ ప్రారంభం..
కరోనా పరీక్షల కోసం రోజుల తరబడి వేచిచూడకుండా ప్రభుత్వం అత్యాధునిక బయోరా డ్ ఆర్టీపీసీఆర్ మిషన్ను అందజేయడంతో ఏ డు గంటల్లోనే 700 కరోనా పరీక్షలు, ఇతర రక్త పరీక్షలు చేయొచ్చని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మైక్రోబయాలజీ విభాగంలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన బయోరాడ్ ఆర్టీపీసీఆర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, పేదల కు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మిషన్తో ఏడు గంట ల్లో 600 నమానాలు పరీక్షించవచ్చునని అన్నా రు. గతంలో మాన్యువల్ పద్ధతిలో 300 నమూనాలను 12 గంటల్లో పరీక్షించే వారమన్నారు. నేడు ఒకే రోజులో 1000 పరీక్షలు చేసేలా ఏర్పా టు చేసినట్లు చెప్పారు. మహబూబ్నగర్ ప్రభు త్వ మెడికల్ కళాశాల ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు మంత్రి ప ట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు నందలాల్ పవార్, సీతారామారావు, కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రాం కిషన్, వైస్ ప్రిన్సిపాల్ సునందిని, ప్రొఫెసర్లు రమాదేవి, నవాల్కిశోర్, కిరణ్ప్రకాష్ ఉన్నారు.
ప్రజలందరి సంక్షేమమే ధ్యేయం..
మహబూబ్నగర్, సెప్టెంబర్ 7 : ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగు లు వేస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 9,10 వార్డులతోపాటు పలు వార్డుల్లో ఏర్పాటు చేసి న టీఆర్ఎస్ గ్రామ కమిటీల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మహబూబ్నగర్ పట్టణ రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతంగా అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆ దుకునేందుకు కృషి చేస్తామన్నారు. బాధ్యతగా పనిచేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ఎన్ఎన్జీ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత, కౌన్సిలర్లు రాణి, నరేందర్, రాజు, వరలక్ష్మి, రవి పాల్గొన్నారు.