ప్రాజెక్టుల రూపకల్పన విభాగం ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి
నిజాలాపూర్ దిండు పరిశీలన
మూసాపేట, మార్చి 28 : గొలుసుకట్టు చెరువులకు నీరు అందించమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు ప్రాజెక్టుల రూపకల్పన విభాగం ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి తెలిపారు. మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన నిజాలాపూర్ దిండును ఆదివారం డీఈఈ కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మూసాపేట చౌటచెరువుకు నీరు వెళ్లాలంటే ఎంతమేరకు దిండు ఎత్తు పెంచాల్సి ఉంటుందనే విషయాలను పరిశీలించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడంతోపాటు, మూసాపేట చౌటచెరువును నీటితో నింపేందుకు ప్రణాళిక రూపొందించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించినట్లు చెప్పారు. నిజాలాపూర్ దిండు ఎత్తు పెంచి చెరువులకు నీరందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, దిండు నుంచి నిజాలాపూర్ గ్రామ చెరువులకు వెళ్లే కాల్వలకు మరమ్మతు చేయించాలని ఆయకట్టు రైతులు ఎస్ఈని కోరారు. తమ వ్యవసాయ భూముల్లోకి నీరు వస్తుండడంతో పనికిరాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, ఉపసర్పంచ్ భీమన్న, మాజీ సర్పంచ్ నారాయణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పుచ్చకాయ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి
ఆరెంజ్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందా?