పంటలు పండించడమే కాదు సొంతంగా విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నాడు మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రైతు మైసరి శ్రీనివాస్. ఈ రైతు మొక్కజొన్న పంట సాగుచేయడంతో స్వల్ప కాలంలోనే లక్షాధికారిగా మారాడు. మొదట తనకున్న రెండెకరాల్లో మక్క పంట సాగుచేయగా, వ్యాపారి వచ్చి రూ.80 వేలకు గంపగుత్తగా కొనుకున్నాడు. తన పంటను వేరే వాళ్లకు వియ్రించడం ఎందుకు..? తానే సొంతంగా విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుందని భావించాడు. తాను పండించిన పంటతో లక్ష రూపాయల ఆదాయం రావడంతో పాటు విక్రయాలతో మరో లక్ష రూపాయలు కేవలం మూడు నెలల్లో ఆర్జించాడు. ప్రతీ రైతు ఈ విధంగా ఆలోచిస్తే దళారుల బెడద దూరం కావడంతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
మొక్కజొన్న పంటతో రైతు లక్షాధికారిగా మారాడు. మొదట తనకున్న రెండెకరాల్లో పంట వేయగా, ఓ వ్యాపారి వచ్చి, రూ.80వేలకు పంటను గంపగుత్తాగా మాట్లాడుకొని, తీసుకెళ్లాడు. తన పంటను వేరే వాళ్లకు విక్రయించడం ఎందుకు? తానే పండించి, అమ్మకాలు జరిపితే మరింత లాభాలు వస్తాయి కదా అని భావించాడు. మూడు నెలల్లో రూ.లక్షతో పాటు అదనంగా కంకుల వ్యాపారం చేస్తూ మరో రూ.లక్ష సంపాదించి తాను రైతునంటూ నిరూపించుకుంటున్నాడు రామాయంపేటకు చెందిన రైతు మైసరి శ్రీనివాస్.
రామాయంపేటకు చెందిన రైతు మైసరి శ్రీనివాస్ తనకున్న రెండుకరాల్లో ఎప్పుడూ వరినే వేసేటోడు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పంటను మార్చాడు. గత సీజన్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట పూర్తిగా చేతికి రాకముందే ఓ వ్యాపారి వచ్చి, రెండెకరాల మొక్కపంటను గంపగుత్తాగా రూ.80వేలకు మాట్లాడుకున్నాడు. పంట రాగానే, అతను వచ్చి కంకులన్నీ తీసుకెళ్లాడు. ఇది గమనించిన శ్రీనివాస్, ఆ వ్యాపారితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నాడు. ఎక్కడ అమ్ముతారు? ఎంతకు విక్రయిస్తారు? మార్కెట్ ఎలా ఉంది? వ్యాపారం ఎక్కడ బాగా నడుస్తుంది? అని కనుకున్నాడు. తన పంటను వ్యాపారులకు విక్రయించడం ఏమిటి? తానే పండించి, తానే అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని భావించాడు. రెండోసారి మొక్కకంకి పంట వేశాడు. ఓ ఆటోను అద్దెకు తీసుకొని, ప్రధాన నగరాలు, అంగళ్లకు వెళ్లి హోల్సేల్గా విక్రయించడం మొదలు పెట్టాడు. ఒక్కో గోనె సంచి బ్యాగులో 250 నుంచి 350 మొక్కజొన్న కంకులు నింపి, వాటిని హోల్సేల్గా రూ.800కు విక్రయించాడు. తనకున్న మరికొంత భూమిలో వేర్వేరు పంటలు వేసి, వాటిని కూడా అమ్మి మరోవైపు రూ.లక్షలు సంపాదించాడు. ఒకప్పుడు కరువులో అల్లాడిన రైతు, నేడు తనకున్న పంటతో పాటు యాసంగిలో మొక్కజొన్న వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. మూడు నెలల్లో రూ.లక్ష సంపాదనతో పాటు అదనంగా కంకుల వ్యాపారం చేస్తూ రూ.లక్ష సంపాదించాడు. ఏదేమైనా రైతు వ్యాపారిగా మారడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కంకుల వ్యాపారం అనుకూలిస్తుంది..
కంకుల వ్యాపారంతో ఆర్థికంగా ఇబ్బందులు పోయాయి. ఒకప్పుడు వరినే వేసేటోళ్లం. ఇప్పుడు కేసీఆర్ సార్ దయతో ఆయన చెప్పిన విధంగా యాసంగిలో మొక్కజొన్న పంట వేసి, లాభాలు పొందుతున్న. నా పంటనే కాకుండా మొక్కజొన్న కంకుల వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న. ఇటీవల నాకు రైతుబంధు పైసలు కూడా వచ్చాయి. నా భార్య పొలం పనులు చూసుకుంటుంది. నేను మార్కెట్లకు వెళ్లి, అమ్ముతుంటా. ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా మా కుటుంబం బాగుంది. మొక్కజొన్నకంకుల కోసం గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, జోగిపేట, కామారెడ్డి, తూప్రాన్ తదితర ప్రాంతాలకు వెళ్లి కంకులను ఎకరాల చొప్పున కొని హోల్సేల్గా విక్రయాలను జరుపుతా.