వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న అని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. తొలి తెలంగాణ బహుజన రాజు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గురువారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 18: పట్టణంలోని పాపన్న విగ్రహం వద్ద, గౌడ సంఘం భవనం వద్ద సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ అపరాద ముత్యంరాజు, గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పంజాల రాంశంకర్ గౌడ్, పట్టణాధ్యక్షుడు శ్రీపతి ఎల్లయ్యగౌడ్, డైరెక్టర్లు కెకెర్ల సారయ్యగౌడ్, పంజాల అశోక్గౌడ్, బొనగాని కుమార్గౌడ్, తాళ్లపల్లి సుదర్శన్గౌడ్, శ్రీపతి ప్రసాద్గౌడ్, న్యాయవాది దొంత భద్రయ్య, నాయకులు కొయ్యడ కమలాకర్గౌడ్, వడ్లకొండ కిరణ్గౌడ్, పంజాల హరీశ్గౌడ్, పూదరి రవీందర్గౌడ్, తడక భిక్షపతి, రాజేశ్, పంజాల సమ్మయ్యగౌడ్, సదానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, ఆగస్టు 18: మున్సిపల్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, నాయకులు, గౌడ సంఘాలు నేతలు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 18: మండలంలోని పెద్దపాపయ్యపల్లి, జూపాక గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బుర్ర సమ్మయ్య, బండ రాజు, శ్రీనివాస్, అశోక్, ఐలయ్య, దశరథం, తిరుపతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 18: మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సర్వాయిపాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మ్యాడగోని బుచ్చయ్యగౌడ్, సొసైటీ అధ్యక్షుడు కత్తి కొమురయ్య గౌడ్, వడ్లకొండ మల్లయ్య, మ్యాడగోని రాజయ్య, గుర్రం సంపత్, గుర్రం రాజు, మ్యాడగోని రాజు, కాసర్ల బుచ్చయ్య, మ్యాడగోని బాలరాజు, మొండయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, ఆగస్టు 18: వావిలాల గ్రామ నడికూడలిలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వావిలాల గౌడ సంఘం నాయకులు కొండ హరీశ్గౌడ్, వీరగోని రాజన్న, వీరగోని వెంకన్న, చంద్రమౌళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 18: మండలకేంద్రంతో పాటు, సోమారం, సర్వాయిపేట, తదితర గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సోమారం సర్పంచ్ పైడిమల్ల సుశీలా తిరుపతిగౌడ్, సింగిల్విండో డైరెక్టర్ల ఫోరం మండలాధ్యక్షుడు బొమ్మగాని రాజుగౌడ్, ఉప సర్పంచ్ అనగోని శ్రీనివాస్గౌడ్, సర్వాయిపాపన్న గీతకార్మిక సంఘం డివిజన్ అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్గౌడ్, అనగోని రమేశ్, సురేశ్, కృష్ణ, రవీందర్, సచిన్, లింగయ్య, రవి, శేఖర్, గంగయ్య, సదానందం, తిరుపతి, రాజు పాల్గొన్నారు.
సర్వాయిపేట శివారులోని కొమ్ముగుట్ట వద్ద సర్వాయిపాపన్న విగ్రహానికి ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్వాయిపాపన్న గీతకార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కలర్ సత్తన్నగౌడ్, వీరగోని పెంటయ్యగౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సంపునూరి మల్లేశంగౌడ్, జిల్లా అధ్యక్షుడు మ్యాడగాని బుచ్చయ్యగౌడ్, సర్పంచ్ ఏనుగుల ఐలయ్య, ఎంపీటీసీలు జెల్ల మల్లేశ్, ఏరుకొండ ఇందిరాసుధీర్, సర్వాయిపాపన్న పుస్తక రచయిత మండల జంపయ్య, నాయకులు అమరగాని శ్రీనివాస్గౌడ్, గొడిశాల రమేశ్గౌడ్, పైడిపల్లి రవీందర్గౌడ్, పోలు ప్రవీణ్కుమార్, తిరుపతి, బుచ్చయ్య, యూట్యూబ్ కళాకారులు స్వరూప, సత్యం, సీతామహాలక్ష్మి, లావణ్య పాల్గొన్నారు.