వరికొయ్యలను తగులబెట్టడం ద్వారా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. నేలకు మేలు చేసే క్రిమికీటకాలు నశించడమే కాదు, భూమిలో సారం తగ్గిపోవడం, వాయు కాలుష్యం పెరిగిపోవడం లాంటి నష్టాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఎండ కాలంలో కాల్చివేయడంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు విలువైన ఆస్తులు, మూగజీవాలు అగ్నికి బలవుతున్నాయి. ఒక్కోసారి మనుషుల ప్రాణాలూ గాల్లో కలుస్తున్నాయి. తాజాగా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో ఓ మహిళా రైతు పొగతో ఊపిరాడక చనిపోవడం కలిచివేసింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలన్నా.. నేలను కాపాడుకోవాలన్నా కొయ్యకాళ్లను కాల్చకపోవడమే మంచిది. మల్చర్ పద్ధతిలో అయినా లేదా గడ్డిని కలియదున్నినా సేంద్రియ ఎరువుగా ఉపయోగ పడుతుంది. భూసారంతోపాటు దిగుబడులు పెరిగి రైతుకు మేలు జరుగుతుంది.
కరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ) / శంకరపట్నం : వరి సాగు పెరగడం.. పశువుల సంఖ్య తగ్గడం.. వంటి కారణాల వల్ల గడ్డి మిగులుతున్నది. అయితే కొంద రు అవగాహనలోపంతో కొయ్యకాలును కాల్చడం వల్ల తీరని నష్టం వాటిల్లుతున్నది. భూసారం దెబ్బతిని దిగుబడులపై ప్రభావం పడుతున్నది. భూమి లోపల ఉన్న కోటానుకోట్ల సూక్ష్మ జీవుల వినాశనం జరుగుతున్నది. ఇదే సమయంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండగా, ఒక్కోసారి మనుషులు, పశువుల ప్రాణాలకూ హాని కలుగుతున్నది. తాజాగా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో రైతు గుండ ఎంకవ్వ (55) వరికొయ్యలు దహనం చేస్తూ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అద్దంపట్టింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలన్నా.. నేలను కాపాడుకోవాలన్నా వరి కొయ్యలను కాల్చొద్దు. సేంద్రియ ఎరువుగా మలుచుకుంటే రైతుకు మేలు జరుగుతుంది.
మల్చర్ విధానంలో కొయ్యకాళ్లు తొలగించుకొనే విధానం పాటించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. గడ్డి కప్పు యంత్రంతో సులువుగా కొయ్యకాళ్ల సమస్యను అధిగమించవచ్చు. ఈ యంత్రంతో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేయవచ్చు. ఈ యంత్రాన్ని ట్రాక్టర్కు తగిలించి కొయ్యకాళ్లను తొలగించవచ్చు. ఈ యంత్ర పరికరంలో గేర్ బాక్స్, రోటర్తో పాటు కత్తులతో చేసిన గడ్డిని సమాంతరంగా నేలపై పరుచుటకు రోలర్తో అమర్చబడి ఉంటుంది. పరికరాన్ని సులువుగా ట్రాక్టర్ త్రీ పాయింట్ లింకేజీ మీద అమర్చుకోవచ్చు. ట్రాక్టర్ పీటీవో ద్వారా శక్తిని తీసుకొని మల్చర్ పని చేస్తుంది.
మల్చర్ పరికరం కొయ్యకాళ్ల గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి నేలపై సమాంతరంగా పరుస్తుంది. దీన్ని నీటి తడి పెట్టి అలాగే వారం, పది రోజుల పాటు మురగనివ్వాలి. తరువాత దున్నితే ముక్కలుగా మారిన గడ్డి నేలలో కలిసిపోతుంది. దీంతో నేలలో తేమ శాతం పెరుగుతుంది. నేల సారవంతం అవుతుంది. నీటి కోతను తగ్గించుకోవచ్చు.
కొయ్యకాళ్లను తగులబెట్టడం వ్యవసాయానికి చేటు చేస్తుంది. వాతావరణంలో కాలుష్యం పెంచుతుంది. ఒక్కసారి కొయ్యకాళ్లను కాల్చితే వ్యవసాయం 20 ఏండ్లు వెనుకబడినట్టే. మట్టిలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇందులో పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. కొయ్యకాళ్లను తగులబెట్టినప్పుడు ఇవన్నీ చనిపోతాయి. దీంతో భూమి సారం కోల్పోతుంది. ఈ విధానం సరికాదని శాస్త్రవేత్తలు సైతం తేల్చారు.. మల్చర్తో ఈ సమస్యకు చక్కని పరిష్కారం దొరికింది. రొటోవేటర్తో దున్నే యంత్ర పరికరం ఇది. ఇది కొయ్యకాళ్లను చిన్న చిన్న ముక్కలుగా, పౌడర్గా మారుస్తుంది. తర్వాత రెండు బస్తాలు సూపర్ వేసి దున్నితే భూమి సారవంతంగా మారుతుంది. దీంతో ఎకరాకు 10 ట్రాక్టర్ల మట్టి వేసినట్లు అవుతుంది.. భూసారం పెరిగి పంట దిగుబడి అనూహ్యంగా పెరుగుతుంది.
– బీ శ్రీనివాస్, ఏడీఏ (మానకొండూర్)
బిడ్డ తనలా పుడుతుందేమోనని ఆ దివ్యాంగ గర్భిణి బెంగ పెట్టుకున్నది. తాను పుట్టుకతోనే మూగ, వినికిడిలోపంతో బాధ పడుతుండగా, జన్మించే పాప అలాగే ఉంటుందేమోనని ఆందోళన చెందింది. తానే లేకుంటే ఏ సమస్యా రాదని భావించిందేమో.. లేక పుట్టబోయే బిడ్డ తనలా ఇబ్బందులు పడకూడదనుకున్నదో.. ఏకంగా ప్రాణాలు తీసుకున్నది. ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. హృదయ విధారక ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టలఎల్లయ్యపల్లెలో జరిగింది.
-ఓదెల, మే 13
తల్లీబిడ్డ అనుమానాస్పదస్థితిలో బావిలో శవమై తేలడం కలకలం రేపింది. రోడ్డుపై భయం భయంగా తిరుగుతున్న నాలుగేండ్ల బాలుడిని గమనించి, గ్రామస్తులు ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముత్తారం మండలం సర్వారంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
-పెద్దపల్లి, మే 13(నమస్తే తెలంగాణ)
చిన్నారి పుట్టెంట్రుకల కోసంవేములవాడకు వెళ్తున్న కుటుంబానికి తీరని దుఃఖం మిగిలింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఆటో బోల్తా పడి ఐదుగురు తీవ్రంగా గాయపడగా, అందులో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. వీరంతా బంధువులే కాగా, మానకొండూర్ మండలం ముంజంపల్లి, శంకరపట్నం మండలం మెట్పల్లిలో విషాదం నెలకొన్నది.
భార్య నుంచి తనను దూరం చేస్తున్నారనే కక్ష పెంచుకుని అత్తామామలను అల్లుడే దారుణంగా కొట్టి చంపాడు. రెండు రోజుల క్రితం మంథని మండలం పుట్టపాక పరిధిలోని చల్లపల్లిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, వివరాలు వెల్లడించారు.
-మంథనిటౌన్, మే 13