కమాన్చౌరస్తా, మే 11: బాలభవన్ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. బాలకేంద్రం బాలభవన్గా అప్గ్రేడ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కృతజ్ఞతాపూర్వక సంతోష సంబురాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ, 2009లో 17 గుంటల స్థలాన్ని కలెక్టర్ బాలభవన్ కోసం కేటాయించినట్లు తెలిపారు. బాలభవన్ ఏర్పాటుకు 1979లో తొలిసారి ప్రతిపాదనలు పంపగా 1980లో పూర్తిస్థాయి బాలభవన్కు బదులు అప్పటి ప్రభుత్వం బాల కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఆ తర్వాత బాల కేంద్రానికి బదులు బాలభవన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైనట్లు చెప్పారు.
ఆయనతో పాటు మంత్రి గంగుల కమలాకర్ వెన్నంటి ఉండి సీఎం కేసీఆర్ దృష్టికి పత్రికలు ప్రచురించిన కథనాలు, జిల్లా వాసుల విజ్ఞప్తులను తీసుకెళ్లి, అధికారుల సహకారంతో పూర్తిస్థాయి బాలభవన్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. దీని ద్వారా సిబ్బందిపై మరింత బాధ్యత పెరిగిందని, రాబోయే రోజుల్లో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, పిల్లలను చదువుతో పాటు కళల్లో ప్రోత్సహించాలని సూచించారు.
చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి జిల్లా బాలభవన్ కృషి చేస్తుందని తెలిపారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ కట్ట మంజులాదేవి, సిబ్బంది కృష్ణకుమార్, సంగెం రాధాకృష్ణ, శ్రీనివాస్, సూర్యశ్రీ, ఎం నీల, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.