విద్యానగర్, ఆగస్టు 11 : కామారెడ్డి జిల్లా కేంద్రం లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి రూ.25 లక్షల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లిన సం ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల, బాధితుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నగువోతు న ర్సింహులు ఇంట్లోనే కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నర్సింహులు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. ఎప్పటిలాగే చికిత్స నిమి త్తం మూడు రోజుల క్రితం నర్సింహులు ఇంటికి తాళం వేసి నిజామాబాద్కు వెళ్లాడు. నిజామాబాద్ నుంచి బుధవారం తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో దాచుకున్న రూ.25 లక్షల నగదు, 5 తులాల బంగారం కనిపించలేదు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం ఘటనా స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డాగ్ స్కాడ్తో ఇం ట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీ చేయించారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరలోను కేసు ఛేదిస్తామని డీఎస్పీ సోమనాథం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఊళ్లకు వెళ్లే వారు ఆయా పోలీసు స్టేషన్లలో సమాచారం అందించాలని తెలిపారు.