కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పెద్దన్నగా ఆదుకుంటున్నాడని చెప్పారు. బుధవారం కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హలులో 101మందికి కోటి రూపాయలకు పైగా కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదింటి ఆడుపడుచులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కల్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపడచులకు వివాహలకు లక్షా 1016రూపాయలను చెల్లిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పేదలకు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో తసీల్దారు జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఎంసీటీసీ ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి.స్థానిక సర్పంచ్ సురుసాని శమంతకమణి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.