బండ్లగూడ : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో బావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు.
అదివారం జ్యోతిబాపూలే వర్దంతి సందర్బంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు బంగి శ్రీనివాస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్థానిక కార్పొరేటర్లతో కలిసి నివాళ్లు అర్పించారు.
ఈ సందర్బంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ నేటి యువత జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగలన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంగీతగౌరిశంకర్, అర్చనజయప్రకాశ్, జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటి సభ్యులు, అర్జున్, సరికొండ వెంకటేష్, కొమురయ్య, యాదయ్య, రాపోలు సత్తయ్య, శివ ముదిరాజ్, సలేశ్వర్, రాధకృష్ణ, అంజయ్యగౌడ్, ధర్మరెడ్డి, మహేష్, సయ్యద్ ముజమిల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.