సికింద్రాబాద్ : 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సతతం ప్రజాహితం భారతీయ హరిత ఛాలెంజ్ సైకిల్ యాత్రకు సీనియర్ జర్నలిస్ట్ సంత్ పొన్నాల గౌరిశంకర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వ మాసపత్రిక సంపాదకులు రాంమోహన్కు పూల మొక్కను అందజేసి సైకిల్ యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పొన్నాల గౌరిశంకర్ మాట్లాడుతూ ప్రాణవాయువును అందించే చెట్లకోసం విరివిగా మొక్కలు నాటి మనవంతు కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు దేశాన్ని పచ్చని వనంలా చేసేందుకు ప్రయత్నించాలన్నారు. అమరవీరుల త్యాగఫలాన్ని అనుభవిస్తూనే ప్రకృతి ప్రసాదించే ప్రాణవాయువును కూడా పొందేందుకు చెట్లను పెంచాలన్నారు. సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు.