ప్రగతి సారథి, సీఎం కేసీఆర్ జన్మదినో త్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహిం చేందుకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. వనపర్తి జిల్లా శాపూర్ వద్ద రైతులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి కేక్ కట్ చేయనుండగా.. పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొనున్నారు. వాడ వాడలా వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో రైతులు, కూలీలు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్కు ముందు గానే బర్త్డే విషెస్ తెలిపారు. అలాగే వనపర్తి మార్కెట్ యార్డులో పల్లీలు, ఉలవలతో సీఎం కేసీఆర్ చిత్రపటం వేసి రైతులు, నాయకులు వారి అభిమానాన్ని చాటుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించేందుకు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు సిద్ధమైంది. రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించనున్నారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షలు పేరుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశనగ, ఉలువలు, ఉప్పు, రంగులతో రూపొందించారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సాధకులు, ప్రగతి సారథి, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. శుక్రవారం నియోజకవర్గ కేంద్రాలు, మండలాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహించేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడంతోపాటు పటాకుల మోతలతో హోరెత్తనున్నది. ఆయా చోట్ల మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనాథశ్రమా ల్లో, దవాఖానల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం మండలం శాపూర్ వద్ద బ్రాంచ్ కెనాల్కు ఎంజీకేఎల్ఐ నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం అక్కడే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని నాయకులు తెలిపారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగే వేడుకల్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని కేక్ కట్ చేయనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఆయా ఎమ్మెల్యేలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రైతులు, ఇత ర వర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు బర్త్డే విషెస్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రా మ శివారులోని వేరుశనగ పంట క్షేత్రంలో కూలీలు, రై తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని చేతిలో పట్టుకున్న రైతులు ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.