ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మహబూబ్నగర్ రూపురేఖలు మారుస్తాం
రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో కొత్తకళ
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్/టౌన్, మార్చి 29 : జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ, తెలంగాణ చౌరస్తా, సద్దలగుండు చౌరస్తాల అభివృద్ధి పనులను కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. బీఈడీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న కూరగాయల మార్కెట్ షెడ్ పనులను పట్టణప్రగతి నిధులతో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు మంత్రి సూచించారు. అనంతరం మెట్టుగడ్డ నుంచి జిల్లా దవాఖానవైపు పాదయాత్రగా మంత్రి వస్తుండగా, దవాఖాన ఎదుట ఎండ లో చెప్పులు కుట్టుకుంటున్న వీరన్నపేటవాసి నర్సింహులుతో మంత్రి మాట్లాడారు. షాపు పెట్టుకునేందుకు వీధి వ్యాపారులకు ఇచ్చే రుణం కింద రూ.50వేలు అందిస్తామని చెప్పడంతోపాటు, దవాఖాన ఎదుట వీధి వ్యాపా రులకు నిర్మించిన ఓ షాపులో నర్సింహులును కూర్చొబెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు నాలుగు లేన్ల రహదారి మంజూరైందన్నారు. జడ్చర్ల-మహబూబ్నగర్ నాలుగు లేన్ల రోడ్డుతోపాటు మహబూబ్నగర్ నుంచి రాయిచూర్, భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ వరకు రోడ్లు వచ్చాయని తెలిపారు. రద్దయిన భారత్మాల రోడ్డును ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి రాష్ట్ర ప్రాధాన్యత కింద మంజూరు చేయించినట్లు చెప్పారు. త్వ రలో జిల్లాలోని ఎదిర-దివిటిపల్లి వద్ద రూ.2వేల కోట్లతో గ్రీన్పార్క్ ఏర్పాటు చేయనున్నామని, ఇండియాలోనే మొదటి ఎలక్ట్రికల్స్ సెల్ ఫ్యాక్టరీ వస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రధానంగా రోడ్లు, జంక్షన్ల విస్తరణతో కొత్త కళ వస్తుందన్నారు. అనంతరం మహబూబ్నగర్, హన్వాడ మండలాలకు చెందిన 30మందికి రూ.15,79,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణమోహన్, శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు కిశోర్, రాము పాల్గొన్నారు.