కందుకూరు : మండలంలోని కొత్తగూడ గ్రామ పంచాయితీ కార్యలయం వద్ద సర్పంచ్ సాధ మల్లారెడ్డి, గ్రామంలోని కూలీలకు జాతీయ ఉపాధి హామీపథకం జాబ్కార్డులను అందజేశారు. ఆయనతో పాటు మండలంలోని 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాలకు మంజూరైన జాబ్ కార్డులను పంచాయతీ కార్యదర్శులకు మండల కేంద్రంలో ఎంపీఓ రవీంద్రెడ్డి అందజేశారు. కూలీలకు అడిగిన వెంటనే పని కల్పించాలని కోరారు. కూలీలు ప్రభుత్వం తమకు కల్పించిన పని దినాలను పూర్తి చేయాలని కోరారు. కొత్తగూడలో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల పద్మమ్మ, వార్డు మెంబర్లు బొక్క హన్మంత్రెడ్డి, మరి శేఖర్రెడ్డి,మహేందర్, సరిత, పంచాయతీ కార్యదర్శి శివకుమార్,నాయకులు చెన్నక్రిష్ణ, బండారి క్రిష్ణ, బాలేష్,సురేందర్రెడ్డి, కూలీలు పాల్గొన్నారు.