అంబర్పేట : బాగ్అంబర్పేట పాములబస్తీకి చెందిన టీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ శివకుమార్ (రాజు) అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా నిధులు మంజూరయ్యాయి. అట్టి చెక్కును గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో శివకుమార్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కెంచె మహేష్, మిర్యాల రవీందర్, నవీన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బాగ్అంబర్పేటకు చెందిన శ్రీకాంత్గౌడ్కు కూడా మంజూరైన రూ.26 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి అతనికి అందజేశారు.