భద్రాచలం, జనవరి 21: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో శుక్రవారం నుంచి రెండోదఫా ఇంటింటా జ్వర సర్వేకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరబాబు ఆధ్వర్యంలో పట్టణంలో 12 టీములు 1,020 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. మొదటి డోస్ వేయించుకోని 46మందిని గుర్తించి వారికి మొదటి డోసు, రెండో డోస్ 148మందిని గుర్తించి వారికి సెకండ్ డోస్ ఇచ్చారు. ఫ్రంట్లైన్ వర్కర్లు, 60ఏళ్లు నిండిన 56మందికి బూస్టర్ డోస్, 15-18ఏళ్ల లోపు 88మందికి జ్వర సర్వేలో భద్రాచలం స్పెషలాఫీసర్ నాగలక్ష్మి, హెచ్ఈవో వీసాల కృష్ణయ్య, సూపర్వైజర్ సద్గుణవాణి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ, రెవెన్యూ, ఐకేపీ సిబ్బంది, పాల్గొన్నారు.
దుమ్ముగూడెం మండలంలో..
దుమ్ముగూడెం, జనవరి 21: మండలంలోని నర్సాపురం, దుమ్ముగూడెం పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వేను చేపట్టారు. నర్సాపురం వైద్యురాలు చైతన్య ఆధ్వర్యంలో ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు తూరుబాకలో సర్వేను చేపట్టారు. నర్సాపురం వైద్యశాల పరిధిలో 28 బృందాలుగా ఏర్పడి 920 గృహాల్లో, దుమ్ముగూడెం పీహెచ్సీ పరిధిలో 21 మంది బృందాలతో 1,790 గృహాలను సర్వే నిర్వహించి కొవిడ్ లక్షణాలున్న 126 మందికి ఐసోలేషన్ మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చందు, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
చర్లలో..
చర్ల, జనవరి 21: కొయ్యూరు పీహెచ్సీని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ శుక్రవారం సందర్శించి ఇంటింటా జరుగుతున్న జ్వర సర్వే వివరాలు తెలుసుకున్నారు. సర్వేలో కొవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి కిట్లను అందజేసి హోం ఐసొలేషన్లో ఉంచారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, డీపీఎంవో, హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్, స్టాఫ్నర్స్ సరస్వతి, ఏఎన్ఎం సరస్వతి పాల్గొన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల, జనవరి 21: మండలంలోని పీహెచ్సీ వైద్యుడు మణిదీప్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం, సీతానగరం, చిన్నబండిరేవు గ్రామాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని గుర్తించి కొవిడ్ మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్యూవో హనుమంతు, హెచ్ఏ నాగేశ్వరరావు, నాగరాజు, ఏఎన్ఎం సావిత్రి, నర్సమ్మ, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
సారపాకలో..
సారపాక, జనవరి 21: మండలంలోని తాళ్లగొమ్మూరు, కోయగూడెం, సారపాక, ఇరవెండి, మోతే పట్టీనగర్ గ్రామాల్లో సర్పంచ్ల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బంది, ఆశా, అంగన్వాడీ, వీఆర్వో, వీఆర్ఏలు బృందంగా ఏర్పడి ప్రతి ఇంటికెళ్లి జ్వర సర్వే చేపట్టారు. కరోనా లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లను అందించి హోం ఐసొలేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తలగాని మురళీమోహన్, షర్మిల, కౌశిక్, శ్వేత, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పినపాకలో..
పినపాక, జనవరి 21: మండలంలో వైద్య, రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ, ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వేను నిర్వహించారు. జ్వరాలు ఉన్న వారికి కరోనా నియంత్రణ కిట్లను పంపిణీ చేశారు. తోగ్గూడెం గ్రామపంచాయతీలో నిర్వహించిన జ్వర సర్వేలో తహసీల్దార్ విక్రమ్కుమార్, మెడికల్ ఆఫీసర్ శివకుమార్ పాల్గొన్నారు.
బూర్గంపహాడ్లో..
బూర్గంపహాడ్, జనవరి 21: ఇంటింటా జ్వర సర్వే లో భాగంగా మండలంలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది సర్వే చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను తెలుసుకుని కరోనా లక్షణాలుంటే మెడికల్ కిట్లను అందజేశారు. పర్యవేక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సర్పంచ్ దివ్యశ్రీ, తహసీల్దార్ భగవాన్రెడ్డి, వైద్యురాలు స్పందన, హెచ్ఈవో రవి, వైద్యసిబ్బంది, ఆశా, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కరకగూడెంలో..
కరకగూడెం, జనవరి 21: మండలంలో ఇంటింటా జ్వర సర్వేను మండల వైద్యాధికారి పర్షియానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జ్వర సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల వివరాలను సేకరించి జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జైసింగ్, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.