తెలుగు, ఆంగ్లం, ఉర్దూ.. ఈ మూడు మీడియాల్లో ఆ బడిలో విద్యాబోధన కొనసాగుతున్నది. అక్కడి టీచర్లు ప్రైవేట్కు దీటుగా పాఠాలు చెబుతున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ శిక్షణ, శుద్ధజలం, ఆహ్లాదకర పరిసరాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నింటా ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఈ బడిలో మొత్తం 477 మంది విద్యార్థులు ఉండగా, 237మంది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఇంగ్లిష్ మీడియం చదువుకున్న డిమాండ్ను తెలియజేస్తున్నది.
కోహీర్, జనవరి 27 : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థులందరికీ మేలు జరుగనున్నది. ఉన్నత వర్గాలకే పరిమితమైన ఇంగ్లిష్ మీడియం సీఎం కేసీఆర్ తీ సుకొన్న మంచి నిర్ణయంతో నిరుపేదలకు కూడా ఉచితంగా అందనున్నది. ఆర్థిక ఇబ్బందులతో త మ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించలేని తల్లిదండ్రుల చిరకాల స్వప్నం ప్రభుత్వ నిర్ణయం తో నెరవేరనున్నది. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లంలో విద్యాబోధన ఉంటే ప్రైవేటు వైపు వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకు నిదర్శనం.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వా ల్ జడ్పీ ఉన్నత పాఠశాల. ఇక్కడ తెలుగు, ఆం గ్లం, ఉర్దూ మీడియంలో విద్యాబోధన కొనసాగుతున్నది. పాఠశాలలో 477మంది విద్యార్థులకు గానూ 237మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. తెలుగు మీడియంలో 117మంది, ఉర్దూలో 123 మందిని కలిపినా కూడా ఇంగ్లిష్ మీడియంపైనే విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నది. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉ న్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు కంప్యూటరులో శిక్షణ పొందుతున్నారు. తాగునీటి కోసం శుద్ధి జ లం కూడా లభిస్తున్నది. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ఎల్అండ్టీ సంస్థ చేయూతనందించింది. ఆరు కంప్యూటర్లు, వాటర్ ప్లాం ట్ను పాఠశాల విద్యార్థుల అవసరార్థం విరాళమిచ్చింది. విద్యార్థులు ప్రయోగాలను నిర్వహించేందును సైన్స్ల్యాబ్ కూడా అందుబాటులో ఉన్నది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఉపాధ్యాయురాలు కళింగభార్గవి రూ.30వేల వరకు ఖర్చు చేసి వాటికి మరమ్మతులు చేయించారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఉపాధ్యాయుడు వసంతరాజ్ రూ.15వేల వరకు ఖర్చు చేసి పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. పాఠశాల హెచ్ఎం సిరాజుద్దీన్తో పాటు ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల ఆవరణ హరితహారం మొక్కలతో కళకళలాడుతున్నది. ఈ పాఠశాల మండలంలో ఆదర్శంగా నిలిచింది.
తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది..
చాలా మంది తల్లిదం డ్రులు తమ పిల్లలను ఇం గ్లిష్ మీడియం కోసం ప్రైవే టు పాఠశాలలకు పంపిస్తు న్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించేందుకు అందరూ తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తరు. తల్లిదండ్రుల సంపాదన పిల్లల చదువులు, దవాఖానలకే పెడుతారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉంటే ప్రై వేటుకు పంపే అవకాశం 90శాతం తగ్గుతుంది. దీంతో వారికి ఆర్థిక భారం తగ్గుతుంది.
ఉన్నత విద్య చదివేందుకు ఈజీగా..
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. చిన్నప్పటి నుంచి ఆంగ్ల మీడియం చదివితే ఉన్నత విద్యనభ్యసించేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చే విద్యార్థులతో కూడా పోటీ పడుతారు.
ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే సంతోషంగా ఉంది
నా కొడుకు శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఇంగ్లిష్ మీడియం కోసం అందరూ వేరే ఊర్లకు పంపిస్తున్నారు. అప్పులు చేసి ఫీజులు కడుతున్నరు. మా లాంటి పేదోళ్లం డబ్బులు లేక సర్కారు స్కూల్లో చదివిస్తున్న. ఇప్పుడు సర్కారు బడిలోనే పైసా ఖర్చు లేకుండా ఇంగ్లిష్ మీడియం చదివించవచ్చు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
ఇంగ్లిష్లో మాట్లాడాలని ఉంది
నాకు ఇంగ్లిష్లో మాట్లాడాలని ఉంది. కానీ, నేను చదివేది గవర్నమెంట్ స్కూల్లో. ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో ఇంగ్లిష్ మాట్లాడడం రాదు. ఇప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియం చెప్పడంతో నేను కూడా ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కంటే మంచిగా చదువుకుంటా.
నాణ్యమైన విద్యే ప్రభుత్వ ధ్యేయం
తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టలని నిర్ణయించడం సంతోషకరం. బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి విద్యార్థులకు సైతం నాణ్యమైన ఉచిత విద్యే లక్ష్యంగా తీసుకురావడంతో పేద విదార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో గ్రామీణ విద్యార్థులు, పట్టణ ప్రైవేటు విద్యార్థులతో సమానంగా పోటీ పడతారు.
విద్యాభివృద్ధికి కృషి హర్షణీయం..
విద్యార్థులు సమగ్రంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించేలా ఇంగ్లిష్ మీడియం ఎం తో ఉపయోగపడుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు ఇంగ్లిష్ మీడియంలో బోధన పద్ధతులను అమలు చేయడం అభినందనీయం. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించాలనే ఆకాంక్ష నెరవేరుతుంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపడుతున్న అంశాల్లో ఇంగ్లిష్ బోధన అమలు చేయడం ఎంతో హర్షణీయం.