కొండాపూర్ :శ్రీ లహరి కృష్ణుని గీతామృతం పాటల ఆడియో టైటిల్ ఆవిష్కరణ బుధవారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్, ప్రముఖ గాయకులు మనో, ధనుంజయ, సాయి చరణ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.