మామిళ్లగూడెం, జనవరి 20: ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ వరర్లు, గ్రామస్థాయి సిబ్బంది కలిసి బృందంలా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించి ఇంట్లోని అందరి ఆరోగ్య వివరాలను తెలుసుకోవాలని సూచించారు. కొవిడ్ పాజిటివ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలని, స్వల్ప లక్షణాలు ఉన్న వారికి హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వాలని, తీవ్ర లక్షణాలు ఉన్న వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని సూచించారు. కొవిడ్ నివారణ చర్యలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎన్హెచ్వోలు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కొవిడ్ మూడో దశలో కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో జన సమూహాలు లేకుండా, ప్రతి ఒకరూ తప్పనిసరిగా మాస్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా సంబంధిత స్టేషన్ల పరిధిలో పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒకరూ రెండు డోసుల టీకాల వేసుకునేలా, వ్యాక్సినేషన్ లక్ష్యాలు పూర్తయ్యేలా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఏడీసీసపీ సుభాశ్ చంద్రబోస్, డీఆర్వో శిరీష, డీఎంహెచ్వో మాలతీ, జడ్పీ సీఈవో అప్పారావు, సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజేశ్, ఆర్డీవో రవీంద్రనాథ్, కలెక్టరేట్ ఏవో మదన్గోపాల్ పాల్గొన్నారు.