ధర్మారం, జనవరి19: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో 3 మాట్ల (చెక్ డ్యాం)ల నిర్మాణాలకు రూ. 88.50 లక్షల నిధులు మంజూరు చేయడంపై రైతులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశా రు. పత్తిపాక శివారులో కంటాపు మాటు నిర్మాణానికి రూ.21,05,000, సాయంపేట శివారులో కుమ్మరోళ్ల మాటు నిర్మాణానికి రూ.36, 55,000, గోపాల్రావుపేట శివారులోని సౌట కాల్వ మాటు నిర్మాణానికి రూ.30,90,000 నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పత్తిపాక, సాయంపేట, గోపాల్రావుపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పత్తిపాకలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఆయా గ్రామాల సర్పంచులు బద్దం సుజాత రవీందర్ రెడ్డి, చెనెల్లి సాయికుమార్, జనగామ అంజయ్య, ఎంపీటీసీ జనగామ లక్ష్మీ రాజయ్య, ఉప సర్పంచులు బద్దం శ్యామలాతిరుమల్రెడ్డి, సంకసాని తిరుపతిరెడ్డి, వార్డు సభ్యు లు, రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. జై కేసీఆర్, జై కొప్పుల అంటూ నినాదాలు చేశారు. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమా ల్లో ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పత్తిపాక గ్రామ కోఆర్డినేటర్ కోయెడ రవీందర్ గౌడ్, విండో డైరెక్టర్లు బద్దం రవీందర్రెడ్డి, మెన్నేని వెంకటేశ్వర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, కటికెనపల్లి ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, మండల యూత్, ఎస్సీసెల్ అధ్యక్షులు మంద శ్రీనివాస్, భారత స్వామి, పత్తిపాక గ్రామాధ్యక్షుడు పత్తిపాక కటికెనపల్లి సురేశ్, పార్టీ నాయకులు చింతల జగన్మోహన్ రెడ్డి, మెన్నేని రాంబాబు, సందినేని కొమురయ్య, మ్యాకల రాజయ్య, కొంగ భూమయ్య, రైతులు పాల్గొన్నారు.