శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టును బుధవారం గవర్నర్ తమిళ సై సందర్శించారు. ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యశాఖల మార్గదర్శకాలతో శంషాబాద్ ఎయిర్పోర్టు అప్రమత్తమైంది.
వివిధ దేశాల నుంచి వచ్చిపోయే ప్రయాణీకులపై ఆంక్షలు విధించడంతో పాటు టెస్టులకు పలు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గవర్నర్ ఎయిర్పోర్టులో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు.
వ్యాక్సినేషన్ కొవిడ్ చెక్ పాయింట్లను తనిఖీ చేశారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే రెండు నెలల పాటు విస్తృతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.