శేరిలింగంపల్లి : దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం శేరిలింగంపల్లి వార్డు కార్యాలయంలో దివ్యాంగుల సమక్షంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి ఆయన కేక్ కట్చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విదంగా దివ్యాంగులకు రూః 3016 పించన్ను అందించడం జరుగుతుందని అన్నారు. దివ్యాంగు లకు అవసరమైన వీల్ చైర్లు, చేతి కర్రలు, త్రీవీలర్ స్కూటీలు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందన్నారు.
దీంతో పాటు డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అందిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.