కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీటి సమస్యపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఈఈ ఎస్ రాజేశ్వర్, కందుకూరు డీఈ జగన్మోహన్రెడ్డిలు నియోజకవర్గంలోని తాగునీటి సమస్య, వాటర్ ట్యాంక్ల నిర్మాణం గురించి ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మిషన్భగీరథ పథకం ద్వారా ఇప్పటికే ఇంటింటికి నల్లాలు ఇచ్చినట్లు తెలిపారు.
మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.45రోజుల్లో పనులను పూర్తి చేయాలని సూచించారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకులను నిర్మించాలని చెప్పారు. కందుకూరు మండలంలోని కందు కూరు క్రాస్ రోడ్డు వద్ద 29లక్షల రూపాయలు, కొత్తగూడ పొచమ్మ దేవాలయం వద్ద 20లక్షల రూపాయలతో ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు.
పద్మావతి కాలనీలో 12లక్షలు, గూడూరులో 22లక్షలు, బాచుపల్లి, చిప్పలపల్లి ఒక్కొ గ్రామంలో 12లక్షల రూపాయల చోప్పున మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్ గ్రామంలో 22లక్షలు, పొరండ్ల, గంగారం గ్రామాల్లో 20లక్షల రూపాయల చోప్పున నాగారంలో 12లక్షల రూపాయల చోప్పున ఓహెచ్ఆర్ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
వేసవి కాలం లోపు పనులను పూర్తి చేసి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని వారిని ఆదేశించారు.కార్యక్రమంలో మిషన్భగీరథ అధికారులు పాల్గొన్నారు.