చేగుంట/నిజాంపేట, జనవరి16 : చల్మెడలో శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథస్వామి కల్యా ణ మహోత్సవాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. నిజాంపేటతో పాటు చల్మెడ, నందిగామ, నగరం, కల్వకుంట, హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. చేగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదా రంగనాథస్వామి కల్యాణం నిర్వహించారు. ఈకార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు దంపతులు, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి దంపతులు, తిరుమలనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, చేగుంట ఆలయధర్మ కర్త బచ్చు సుదర్శన్ పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గోదా సహిత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యా ణం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యా ణ మహోత్సనికి ‘ఖేడ్’ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి హాజరై పూజలు చేశారు.టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని సన్మానించి క్యాలెండర్, డైరీని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ నేతలు పాల్గొన్నారు.