వెంగళరావునగర్ : బాలిక అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా వచ్చవాయి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఏడాదిన్నర క్రితం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చారు.
మధురానగర్ కాలనీలోని వెల్లంకి ఫుడ్స్ సమీపంలో గల ఓ అపార్ట్ మెంట్లో వాచ్మెన్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నా రు. వీరి కూతురు (15) ఈ నెల 22న రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నిదురించింది. ఉదయం లేచాక బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.