మెదక్ మున్సిపాలిటీ, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఉద్యోగుల డీఎ పెంపు, విడుదల నిర్ణయంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. బుధవారం జీవో 3 జారీ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం, తక్కువ కాలంలోనే పెండింగ్లో గల డీఏలను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం తమకు వరం లాంటిదని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో మూడు డీఏల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరువు భత్యానికి సంబంధించి కొద్ది రోజులుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కరువు భత్యాలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతున్నది. ఉద్యోగులతో పాటు పింఛన్దారులుకు సైతం ప్రయోజం చేకూరే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడంతో ఉద్యోగవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెండింగులో గల మూడు డీఏలను వచ్చే నెల వేతనంతో కలిపి చెల్లించనున్నట్లు జీవోలో పేర్కొనడంతో ఉపాధ్యాయ, ఉద్యోగులు, పింఛన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహం
ఉద్యోగులు, పింఛన్దారులకు పెండింగ్ డీఏకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వంపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతున్నా ప్రస్తు తం పరిస్థితుల్లో ఉద్యోగులపై స్నేహం కొనసాగిస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రభుత్వ పాఠ శాలలకు జీవం పోసే విధంగా ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడాన్ని పీఆర్టీయూ స్వాగతిస్తున్నది.
-మల్లారెడ్డి, పీఆర్టీయూ
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
రెండు సంవత్సరాలుగా 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 3 డీఏలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీన్ని టీఎన్జీవో స్వాగతిస్తున్నది.
-దొంత నరేందర్, టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగులకు తీపి కబురు..
రాష్ట్ర ప్రభుత్వం 3 డీఏలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు తీపి కబురు అందించనట్లయింది. రెండేండ్లలో 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో మిగిలిన 2 డీఏలను విడుదల చేయాలి.
-దుర్గయ్య, టీఎన్జీవో, నాయకుడు