చాదర్ఘాట్ : ముసరాంబాగ్ డివిజన్లోని వీరభద్రీయ సంఘం కాలనీలో మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులను మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల కోరారు. మంగళవారం డివిజన్ పరిధిలోని వీరభద్రీయ కాలనీలో ఎమ్మెల్యే అహ్మద్ బలాల జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. దాదాపుగా పది రోజుల నుంచి కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు వివరించారు. దశాబ్దాల క్రితం నాటి పైప్లైన్ పూర్తిగా శిధిలావస్థకు చేరుకుందని, క్తొతగా మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే ను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ కలుషిత జలాల సరఫరా నివారణకు కొత్తగా డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులను కోరారు. వెంటనే పనులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరభద్రీయ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు కె.రాజేశ్వర్రావు, బస్తీ సంఘం అధ్యక్షుడు కె.రాజేందర్, కె.ఎల్లయ్య, జలమండలి అధికారులు షీలా రాణీ, చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు.