మిడ్జిల్, జనవరి 19 : ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వెలుగొమ్ములలో బుధవారం నిర్వహించిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వెలుగొమ్ముల లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జాతరలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆలయ కమి టీ సభ్యులు ఎమ్మెల్యేతోపాటు మండల ప్రజాప్రతినిధులను సన్మానించారు. అదేవిధంగా ఊర్కొండపేట జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సర్పంచ్ అంజమ్మ, పీఏసీసీఏస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఆల య కమిటీ చైర్మన్ రఘుపతిరెడ్డి, నాయకులు సుధాబాల్రెడ్డి, పాండు, సుదర్శన్, బాలస్వామి, బాబా, వెంకట్, ప్రతాప్రెడ్డి, నారాయణరెడ్డి, నిరంజన్, సత్యనారాయణ, బాల్రెడ్డి, జంగయ్య, భీంరాజు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల పరిశీలన
జడ్చర్ల, జనవరి 19 : మున్సిపాలిటీలోని సర్ధార్ వల్లబాయ్పటేల్నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. పాఠశాలలో అసంపూర్తిగా మిగిలిన అదనపు గదుల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.12లక్షలు మం జూరు చేసినట్లు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి వి ద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దోరేపల్లి రవీందర్, జగన్, బీ.కృష్ణారెడ్డి, అబ్దుల్లా, శ్యామ్, కౌన్సిలర్లు దేవా, శశి తదితరులు పాల్గొన్నారు.