వనస్థలిపురం : సాహెబ్నగర్ త్రినేత్రాంజనేయ దేవస్థానం అభివృద్ధికి కృషిచేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అభయాంజనేయ భక్త కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి రూ.8కోట్లు మంజూరు అయ్యాయని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్గౌడ్, మార్కెట్ డైరెక్టర్ అనిల్ దరి, ఆలయ డైరెక్టర్ ఉమేష్గౌడ్, గురు స్వాములు సురేష్గౌడ్, నగేష్గౌడ్, పృథ్విరాజ్గౌడ్, దాసు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.