హయత్నగర్ : హయత్నగర్ డివిజన్లోని దత్తాత్రేయనగర్ కాలనీలో మార్చి నెల వరకు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హామీనిచ్చారు. ఆదివారం హయత్నగర్లోని దత్తాత్రేయనగర్ కాలనీకి నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారం(ఆర్చీ) ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరై మాట్లాడుతూ కాలనీలో ఇతర సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం కాలనీకి ఇండ్ల పెద్దభిక్షమయ్య, కిష్టమ్మ జ్ఞాపకార్ధంతో ఏర్పాటు చేసిన ముఖద్వారం ధాతలు ఇండ్ల ఏడుకొండలు, వీణ దంపతులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరిరెడ్డి, దత్తాత్రేయ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రమేష్, ట్రెజరర్ శోభన్, ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, యాదగిరిరెడ్డి, కిరణ్, శ్రీశైలం, రామస్వామి, నాగమణి, గౌరవ అధ్యక్షుడు ఇండ్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.