రాజాపూర్, జనవరి 20 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ సుశీల అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులను కేటాయిస్తున్నదన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని తెలిపారు. అనంతరం అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొ న్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
సీసీరోడ్డు పనులు ప్రారంభం
మండలకేంద్రంలో రూ.26లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయన్నా రు. ప్రతి పల్లెకూ బీటీరోడ్డుతోపాటు సీసీరో డ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీలారమేశ్నాయక్, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ఎంపీడీవో లక్ష్మీదేవి, తాసిల్దార్ శంకర్, ఎంపీవో వెంకట్రాములు, ఉపసర్పంచ్ శ్రీనివాస్, అచ్చ య్య, శ్రీను, సత్యయ్య పాల్గొన్నారు.