అంబర్పేట : ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం పరామర్శించారు. విద్యానగర్లోని ఆయన ఇంటికి వెళ్లిన దత్తాత్రేయ పూలబొకే ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.