మారేడ్పల్లి : దళిత బంధు పథకం, ఒక వినూత్నమైన పథకం అని, దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని హైదరా బాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని మల్టిపర్పస్ కమ్యూనీటి హాల్లో కంటోన్మెంట్ నియోజకవర్గ దళిత బంధు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే జి. సాయన్నలు హజరైయ్యారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని అమలు చేసి వారికి అండగా నిలిచారని అన్నారు. హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన కంటోన్మెంట్లో మొట్టమొదటి సారి దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని దళితులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు .
అనంతరం ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత జాతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు.సీఎం కేసీఆర్ దళితల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేసి దళిత ప్రజలందరికి అండగా నిలిచారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి రమేష్, డిజీఎం పవన్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు పాండుయాదవ్, నళిని కిరణ్, లోకనాథం, టీఆర్ఎస్ నాయకులు ఆకుల హరి, సిఎన్. నర్సింహ్మముదిరాజ్, పిట్ల నాగేష్ ,పెంటా శ్రీహరి, శర్వీన్, కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.