కొత్తగూడెం సింగరేణి, జనవరి 19 : సింగరేణి సంస్థ వ్యాప్తంగా మూడో దశలో కరోనా రోజురోజుకూ విజృంబిస్తున్నది. ఇప్పటివరకు 2,086 పాజిటివ్ కేసులు నమోదు కాగా 324 మంది పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 262 కేసులు రాగా, 921మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడికి డైరెక్టర్(పా) బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులకు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని సూచించారు. కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లను సిద్ధం చేశారు. సింగరేణి ఓపెన్కాస్ట్ గనులు, భూగర్భ గనులు, వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
11 ఏరియాల్లో కేసుల వివరాలు..
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్లో 15 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగూడెం కార్పొరేట్లో 42మందికి పాజిటివ్ రాగా, మొత్తం 150 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో తాజాగా 16 మందికి పాజిటివ్ రాగా, మొత్తం 42 మందికి పాజిటివ్ ఉంది. మణుగూరు ఏరియాలో తాజాగా 18 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 43 మంది చికిత్స పొందుతున్నారు. ఇల్లెందు ఏరియాలో తాజాగా ఐదుగురు కరోనా బారిన పడగా మొత్తం 31మంది, భూపాలపల్లి ఏరియాలో తాజాగా 26 మందికి రాగా మొత్తం 61మంది కరోనా బారినపడ్డారు. ఆర్జీ-1 ఏరియాలో తాజాగా 38 మందికి రాగా, మొత్తం 137 మంది చికిత్స పొందుతున్నారు. ఆర్జీ2 ఏరియాలో తాజాగా 27 మందికి రాగా, మొత్తం 99 మంది చికిత్స పొందుతున్నారు. ఆర్జీ3 అండ్ అడ్రియాలా ప్రాజెక్టులో తాజాగా 13 మందికి రాగా, మొత్తం 53 పాజిటివ్ కేసులు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలో తాజాగా 35 మందికి రాగా, మొత్తం 175మంది చికిత్స పొందుతున్నారు. మందమర్రి ఏరియాలో తాజాగా 31 మందికి రాగా, మొత్తం 86 మంది చికిత్స పొందుతున్నారు. బెల్లంపల్లి ఏరియా గోలేటిలో 10 మందికి రాగా, 21 మంది చికిత్స పొందుతున్నారు. ఎస్టీపీపీలో తాజాగా 1, మొత్తం 8 కేసులు ఉన్నాయి. మంగళవారం ఒక్క రోజే 262 పాజిటివ్ కేసులు రాగా, సంస్థ వ్యాప్తంగా 921 మంది చికిత్స పొందుతున్నారు.
డిపెండెంట్స్, రిటైర్మెంట్ కార్మికులు మొత్తం హైదరాబాద్లో 8 మంది, కొత్తగూడెం కార్పొరేట్లో 203 మంది, కొత్తగూడెం ఏరియాలో 37 మంది, మణుగూరు ఏరియాలో 62 మంది, ఇల్లెందు ఏరియాలో 27 మంది, భూపాలపల్లి ఏరియాలో 77మంది, ఆర్జీ1 ఏరియాలో 144 మంది, ఆర్జీ2 ఏరియాలో 85 మంది, ఆర్జీ-3 అండ్ అడ్రియాలాలో 41 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 149 మంది, మందమర్రి ఏరియాలో 53 మంది, గోలేటి/బెల్లంపల్లి ఏరియాలో 8 మంది, ఎస్టీపీపీలో 8 కేసులు ఉన్నాయి. సంస్థ వ్యాప్తంగా 902 మందికి పాజిటివ్ వచ్చింది.
కాంట్రాక్టు కార్మికులు / డిపెండెంట్స్…
హైదరాబాద్లో 19మంది, కార్పొరేట్లో 41 మంది, కొత్తగూడెం ఏరియాలో 19 మంది, మణుగూరు ఏరియాలో 5 గురు, ఇల్లెందులో నలుగురు, భూపాలపల్లిలో నలుగురు, ఆర్జీ1 ఏరియాలో 8 మంది, ఆర్జీ2 ఏరియాలో ఆరుగురు, ఆర్జీ3 అండ్ ఏపీఏలో 11 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 15 మంది, మందమర్రి ఏరియాలో 95 మంది, గోలేటి/బెల్లంపల్లి ఏరియాలో నలుగురు, ఎస్టీపీపీలో 32 పాజిటివ్ కేసులు ఉన్నాయి. సంస్థ వ్యాప్తంగా మొత్తం 263 మందికి కరోనా వచ్చింది.
చికిత్స పొందుతున్న వారు…
హైదరాబాద్లో 42 మంది, కొత్తగూడెం కార్పొరేట్లో 394, ఏరియాలో 98, మణుగూరులో 110, ఇల్లెందులో 62, భూపాలపల్లి ఏరియాలో 142, ఆర్జీ1 ఏరియాలో 289, ఆర్జీ2 ఏరియాలో 190, ఆర్జీ3 అండ్ అడ్రియాలా ప్రాజెక్టులో 105, శ్రీరాంపూర్ ఏరియాలో 339, మందమర్రి ఏరియాలో 234, గోలేటి/ బెల్లంపల్లి ఏరియాలో 33, ఎస్టీపీపీలో 48 ఉన్నారు. మొత్తం 2,086 మంది కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. 324 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 1,762 మంది చికిత్స పొందుతున్నారు.