నర్సాపూర్, జనవరి 21 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేతో గతంలో మంచి ఫలితాలు పొందామని డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు గుర్తుచేశారు. శుక్రవారం రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన జ్వర సర్వేను డీఎంహెచ్వో పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో విజయనిర్మల, మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే
వెల్దుర్తి, జనవరి 21 : ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే ఉమ్మడి వెల్దుర్తి మండలంలో కొనసాగుతున్నది. శుక్రవారం మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటతోపాటు అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించారు. వెల్దుర్తి, మాసాయిపేట గ్రామాల్లో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పరిశీలించారు. ఉమ్మడి మండలంలో 46 బృందాలను ఏఎన్ఎం, అంగన్వాడీ టీచ ర్లు, ఆశ వర్కర్లతో ఏర్పాటు చేశారు. ఉమ్మడి మండలంలో 3,646 ఇండ్లలో సర్వే చేయగా, 181 ఇండ్లలో జ్వరం, 48 ఇండ్లలో దగ్గు, 32 ఇండ్లలో గొంతునొప్పి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మందులు అందజేశామని తెలిపారు.
ప్రతిఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవాలి
చేగుంట, జనవరి 21 : ఆరోగ్య సమస్యలుంటే జ్వర సర్వేలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన చేగుంటతోపాటు కర్నాల్పల్లి, అనంతసాగర్, మక్కరాజిపేట, నడిమితండా, చిన్నశివునూర్, పులిమామిడి, ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వర సర్వే చేపట్టారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జయరాజ్, ఎంపీడీవో ఉమాదేవి, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఈవో రాణి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
నార్సింగి మండలంలో..
మండల కేంద్రమైన నార్సింగితోపాటు వల్లూర్ గ్రామంలో నిర్వహించిన జ్వర సర్వేలో నార్సింగి ఎంపీపీ సబిత, సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పేటలో ఇంటింటి జ్వర సర్వే..
పెద్దశంకరంపేట, జనవరి 21 : మండలంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి ఇంటింటి సర్వే నిర్వహించినట్టు వైద్యాధికారి పుష్పలత తెలిపారు. శుక్రవారం మండలంలో మొత్తం 2189 కుటుంబాల్లో జ్వర సర్వే నిర్వహించారు. ఇందులో స్వల్ప లక్షణాలు ఉన్న 52 మందికి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీవో రియాజొద్దీన్, సీడీఎస్ సూపర్వైజర్ శ్రీశైల, ఆశ కార్యకర్తలు, ఎఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
పేటలో ఇంటింటి జ్వర సర్వే..
పెద్దశంకరంపేట/శివ్వంపేట/నర్సాపూర్, జనవరి 21 : మండలంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి ఇంటింటి సర్వే నిర్వహించినట్టు వైద్యాధికారి పుష్పలత తెలిపారు. మండలంలో మొత్తం 2189 కుటుంబాల్లో జ్వర సర్వే నిర్వహించారు. ఇందులో స్వల్ప లక్షణాలు ఉన్న 52 మందికి మందులు అందజేశారు. శివ్వంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తాతో కలిసి సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్ గ్రామస్తులకు మాస్క్లు పంపిణీ చేశారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో నిర్వహించిన జ్వర సర్వేను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో నిర్వహించిన జ్వర సర్వేను మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో 1303 ఇండ్లలో జ్వర సర్వే
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 21 : జిల్లా కేంద్రం లో 1303 ఇండ్లలో జ్వర సర్వే చేపట్టామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన సర్వేలో వైద్యసిబ్బంది, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్ధశ్వరి, టీఆపీఎస్ దేవరాజ్, మెప్మా టీఎంసీ సునీత పాల్గొన్నారు. సర్వేలో 177 మందికి జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడికల్ కిట్లను అందజేశామని ఆయన తెలిపారు.
కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి..
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 21 : కరోనా నివారణకు ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ రాగి వనజ సూచించారు. జ్వర సర్వేలో భాగంగా పట్టణంలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉన్నవారిని గుర్తించి మందులు అందజేశారు. 6వ వార్డులో కౌన్సిలర్ వనజ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో కలిసి ఇంటింటికెళ్లి వివరాలు సేకరించారు. కొవిడ్ లక్షణాలు ఉంటే తమకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.