కరోనా వ్యాప్తి నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఒమిక్రాన్, కొవిడ్ వాక్సినేషన్పై బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ కట్టడికి అన్ని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీల్లోనూ కొవిడ్ టెస్ట్లు చేయడంతోపాటు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్తోపాటు బూస్టర్ డోస్ ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా టెస్టింగ్ కిట్లు, ఐసొలేషన్ కిట్లకు కొరత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ జిల్లా కేంద్ర దవాఖానతోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా మాస్క్ ధరించడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలని కోరారు.
నల్లగొండ, జనవరి 19 : కరోనా నియంత్రణకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, అధికారులతో ఒమిక్రాన్ కట్టడి వాక్సినేషన్పై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరోనా నియంత్రణకు నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోస్ 99.83శాతం, రెండో డోస్ 70.53శాతం టీకాలు వేశారన్నారు. స్వల్ప కాలంలోనే టీనేజర్లకు సైతం 61.42శాతం వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు సీనియర్ సిటిజన్స్కు సైతం ఇప్పటి వరకు బూస్టర్ డోస్ 5995 మందికి వేశారన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందక ముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ బారిన పడ్డ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 614 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా అందులో 8మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నట్లు తెలిపారు. అనంత రం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం ఒమిక్రాన్ వృద్ధి చెందకు ండా చర్యలు చేపడుతున్నామన్నారు.
డయాలసిస్ రోగులకు బెడ్లు పెంచాలని వినతి
నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు, సౌకర్యాలు మెరుగుపర్చాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంత్రికి కోరారు. నల్లగొండ, మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ రోగులకు బెడ్లు పెంచాలని ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు విన్నవించారు. దేవరకొండ ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరారు. వాటికి మంత్రి సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ పాల్గొన్నారు.
నుడాకు తుది మెరుగులు
నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా నల్లగొండ నియోజకవర్గ అభివృద్దికి అడుగులు పడుతున్నాయి. నల్లగొండ పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు కేటాయించగా వాటి వినియోగం, చేపట్టే అభివృద్ధిపై ఇటీవల మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి పర్యటించి అభివృద్దికి తుదు రూపకల్పన చేశారు. దీనికి అనుణంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కలెక్టరేట్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్లగొండ పట్టణాభివృద్ధి సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఆయన ఆకాంక్షకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు కళాభారతి స్టేడియం, అర్బన్ పార్కులు, వెండర్ జోన్లో, శిల్పారామాల ఏర్పాటుపై విశ్లేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్రావు, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.