వైరా, జనవరి 21 : వైరా అభివృద్ధికి అడ్డంకులు కల్పించకుండా సహకరిస్తే వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన వైరాలోని తన కార్యాలయంలో చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులతో సమావేశమయ్యారు. ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖ, ఇండోర్ స్టేడియానికి సంబంధించిన స్థలాల్లో ఆక్రమణ దుకాణాలను తొలగించకుండా కొంతమంది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డంకులు కల్పించకుండా సహకరించాలని సూచించారు. 90శాతానికి పైగా ఆక్రమణలు తొలగించినప్పటికీ మిగిలిన 10శాతం మంది వల్ల జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నారు. తమ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించి సహకరించాలని కోరారు. కలెక్టర్తో మాట్లాడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వాటిలో వ్యాపారాలు చేసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, 12వ వార్డు కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ధార్నా రాజశేఖర్, మండల మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్రావు పాల్గొన్నారు.
జన్మస్థలం రుణం తీర్చుకుంటా
జూలూరుపాడు, జనవరి 21 : మండలంలోని పాపకొల్లు గ్రామపంచాయతీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి జన్మస్థలం రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. పాపకొల్లు రైతువేదికలో శుక్రవారం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ బాదావత్ లక్ష్మి్మ అధ్యక్షతన అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో రూ.5కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డివైడర్, సైడ్ డ్రైనేజీ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సహకార సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు చౌడం నర్సింహారావు, నాయకులు రోకటి సురేశ్, రామిశెట్టి రాంబాబు, భోజ్యాతండా సర్పంచ్ లావుడ్యా కిషన్లాల్, సక్రూ నాయక్, పసుపులేటి మోహన్రావు, సీపీఎం నాయకులు యాస నరేశ్, సీపీఐ నాయకులు యాస రోశయ్య, నాయకులు శ్రీను, శ్రీనాధరాజు, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.