మైలార్దేవ్పల్లి : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ దవాఖానను ఏర్పాటు చేయలని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కోరారు. గురువారం మంత్రి హరీశ్రావు కలిసి నియోజకవర్గంలో కావసిన అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు.
శంషాబాద్ దవాఖానలో 50 పడకలు, దానికి సంబంధించిన వైద్య పరికరాలు కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. మైలార్దేవ్పల్లిలో స్పోర్ట్స్ స్టేడియం అసంపూర్తిగా నిలిచిపోయిందని స్టేడియం పనులను పూర్తి చేయుటకు ,స్టేడియంలో నూతన స్కేటింగ్ గ్రౌండ్ ఏర్పాటుకు నిధులు మంజురు చేయాలని కోరారు.
ఈ మేరకు అభివృద్ధి పనులపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ తెలిపారు.