బంజారాహిల్స్ : ఫిలింనగర్లోని అభయాంజనేయస్వామి ఆలయం గతంలో ఉన్న చోటే నిర్మించాలంటూ పలు హిందూ సంస్థలు మంగళవారం ఆందోళన నిర్వహించాయి. వీహెచ్పీ, భజరంగ్దళ్తో పాటు పలు సంస్థలకు చెందిన కార్యకర్తలు, సాధువులు ఫిలింనగర్ చేరుకొని రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్కు చెందిన స్థలంలో బైఠాయించాయి.
గతంలో గుట్టమీద ఉన్న ఆలయాన్ని తొలగించి వేరే చోట పెట్టేందుకు నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తుందని అలాంటి చర్యలు మానుకొని ఉన్న చోటనే ఆలయాన్ని పునః నిర్మించాలని వీహెచ్పీ అధ్యక్షుడు రామరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హిందూ సంస్థల ప్రతినిధులకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.