చంపాపేట : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ఘాట్లో పురాతన చరిత్ర కలిగిన ధ్యానాంజనేయ ఆలయానికి త్వరలోనే వస్తానని స్వామి వారిని దర్శించుకుంటాననీ తెలంగాణ రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్త్ర ప్రధాన కార్యదర్శి కొండ యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి హరీశ్ రావు పేరుతో, ఆలయ వేద పండితుల మంత్రోత్సవాలతో అభిషేకం అర్చనలు నిర్వహించి స్వామి వారి ప్రసాదాలను మంత్రి హరీశ్ రావుకు ఆయన నివాసంలో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యతను తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ త్వరలోనే కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటానని ఆయన ఆయనకు తెలిపారు. అనంతరం సంఘ నాయకులతో కలసి మంత్రి హరీశ్ రావుకు ఆయన చిత్రపటాన్ని అందజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నాగలక్ష్మీ, యాదగిరి ముధిరాజ్ తదితరులు పాల్గొన్నారు.