సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జీ విఠల్ రెడ్డి, రేఖానాయక్ అన్నారు. గురువారం నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. రైతుబంధు కింద ఆదిలాబాద్ జిల్లాలో 1,34,892 మంది రైతులకు రూ.220.17 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,05,433 మందికి 149.66 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 1,35,855 మందికి రూ.142.13 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,65,691 మందికి రూ.194.51 కోట్లు వేశారు. మొత్తం 5,41,871 మంది రైతులకు రూ.707.01 కోట్లు వచ్చాయి.
భైంసాటౌన్, జనవరి 13 : మండలంలోని దేగాం రైతు వేదిక ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ముథోల్ తాలుకాలో వర్షాలకు దెబ్బతిన్న వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూస్తానని, గ్రామంలో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రాన్ని ఈ నెల 16న ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సూర్యకాంత్ రెడ్డి, శ్రీధర్, దత్తు, రాంరెడ్డి, హన్మంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కిష్టన్న, మశ్చేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, అనంత్ రెడ్డి, పరమేశ్వర్, మాణిక్యం, సాయిలు, రైతులు పాల్గొన్నారు.
విఠోలిలో
బాసర, జనవరి 13 : ముథోల్ మండలం విఠోలిలో ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ఖాన్, సర్పంచ్ సత్తయ్య గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాంరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పిప్పెర కృష్ణ, పీఏసీఎస్ వెంకటేశ్గౌడ్, నాయకులు నాగేశ్, వంశీకృష్ణ, సురేందర్, బాశెట్టి రాజన్న, రైతులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్/ ఖానాపూర్ రూరల్, జనవరి 13: ఖానాపూర్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. సత్తెనపల్లి రైతు వేదిక వరకు ర్యాలీ కొనసాగింది. తర్లపాడ్లో ర్యాలీకి విశేష స్పందన లభించింది. పలువురు నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. రైతు వేదిక ఆవరణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గంగాధర్, ఖానాపూర్ ఇన్చార్జి ఏడీఎ ఆసం రవి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఏఈవోలు, పలు గ్రామాల సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి 13 : ఇంద్రవెల్లిలో మాజీ ఎంపీ గోడం నగేశ్ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతుల ఆధ్వ ర్యంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రవెల్లి ఏఎంసీ నుంచి అంబేద్క ర్ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. మార్కెట్ కమిటీ యార్డులో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజే తలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నగేశ్ మాట్లా డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుబంధు పథకం ద్వారా రూ. 50 వేల కోట్లు అందించిం దన్నారు. ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాం నాయక్, సర్పంచ్లు కోరెంగా గాంధారి, ఆడే విజయ, రాంచందర్, కుడే కైలాస్, ఉప సర్పంచ్ గణేశ్ టెహెరే, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, గీత్తే ఆశాబాయి, రైతుబంధు సమితి అధ్యక్షుడు తొడసం హరిదాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాథోడ్ వసంత్ రావ్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కనక హనుమం త్రావ్, ఆరెల్లి రాందాస్, నాయకులు దేవ్పూజె మారుతి, శ్రీనివాస్, సుంకట్రావ్, గారోళే దశరథ్ పటేల్, ధర్ము, బాబుముండే, నగేశ్, సర్కాళే శివాజీ, రాంషావ్, బాల్ సింగ్, రాంనివాస్, నవాబ్బేగ్, కేంద్రే శ్యామ్ పాల్గొన్నారు.