గోల్నాక : అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నఅర్హులైన ప్రతి ఒక్కరిని సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
బర్కత్పురకు చెందిన రామ్లీలకు రూ.2లక్షలు, అంబర్పేట పటేల్నగర్కు చెందిన ఇఫ్తాకర్కు రూ.60వేలు, న్యూ నల్లకుంటకు చెందిన ప్రియాంకకు రూ. 60వేలు, రత్నానగర్కు చెందిన మధుసూదన్కు రూ.60వేలు, బాగ్అంబర్పేట బతుకమ్మకుంటకు చెందిన కిరణ్బాబుకు రూ.1లక్షా50వేలు, బాగ్లింగంపల్లికి చెందిన షబానా బేగంకు రూ. 60వేలు, మొత్తం రూ.5లక్షల 92వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.