బంజారాహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒక ప్రముఖ దినపత్రిక కార్డునిస్ట్ వేసిన ఓ కార్టూన్ను మార్ఫింగ్ చేసి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి అభ్యంతరకర రీతిలో ఫేస్బుక్ వేదికగా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫోస్ట్ చేశాడు. ఈ మేరకు టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్రెడ్డి గత నెల 29న ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫేస్బుక్ పోస్టులను గమనించారు.
ఈ మేరకు సోమవారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 504, 505(2), 153ఏ తో పాటు 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.