ఆర్కేపురం : కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తొలగిపోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులచే సమర్పించబడిన 108 నూతన బంగారు పుష్షాలతో శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, దుర్గామల్లేశ్వరి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ హాజరయ్యారు. మంత్రి చేతుల మీదుగా దుర్గా అమ్మవారికి 108 బంగారు పుష్షాలతో అర్చన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి పేద్దపీట వేస్తున్నారని చెప్పారు.
ఆలయ చైర్మన్ జగిని రమేష్ గుప్తా , డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, నాయకులు గొడుగు శ్రీనివాస్, సాజీద్, రాజుశ్రీవాస్తవ, శ్యామ్గుప్త తదితరులు పాల్గొన్నారు.