బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట్, బేగంపేట్, బన్సీలాల్పేట్, మోండామార్కెట్ డివిజన్లకు చెందిన 68 మంది కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పెట్టి పేదింటి ఆడపడుచుల వివాహానికి లక్ష నూట పదహార్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకోని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే అభివృద్ధిలో ఆదర్శంగ నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరిశ్రీహరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, ఉప్పల తరుణి, అరుణగౌడ్, సికింద్రాబాద్ తహసిల్థార్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు.