సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): పాస్పోర్టు వెరిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. జీరో పెండింగ్స్తో హైదరాబాద్ పోలీసులు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కార్యాలయంలో హాజరవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఆ తరువాత ఆ వివరాలు పోలీసులకు పంపిస్తారు. వెంటనే వారు దరఖాస్తుదారుడు ఉంటున్న చోటకు వెళ్లి సర్టిఫికెట్లు, క్రిమినల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా పరిశీలించి.. ఆ నివేదికను తిరిగి పాస్పోర్టు కార్యాలయానికి పంపిస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా పాస్పోర్టును జారీ చేస్తారు. గతంలో ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు గరిష్ఠంగా నాలుగు రోజుల్లోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి..దరఖాస్తుదారుడికి వేగంగా పాస్పోర్టు అందిస్తున్నారు.
వేగంగా పరిష్కరిస్తూ..
పాస్పోర్టు వెరిఫికేషన్తో పాటు ఇతర దరఖాస్తులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరిస్తున్నారు. పాస్పోర్టు వెరిఫికేషన్లో హైదరాబాద్ పోలీసుల ప్రతిభను గుర్తించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అవార్డులను సైతం అందించింది. ఆరేండ్ల నుంచి పాస్పోర్టు వెరిఫికేషన్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి వరుసలో ఉంది.