నారాయణపేట టౌన్, జనవరి 19: బడి ఈడు పిల్లలందరినీ తప్పనిసరిగా బడిలో చేర్పించాలని సీఆర్పీలు అరీఫ్, పవిత్ర అన్నారు. బడి బయటి పిల్లలను గుర్తించుటలో భాగంగా బుధవారం పట్టణంలోని అశోక్నగర్లో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏండ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు. విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ తమ పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అంతేకాకుండా దివ్యాంగులైన పిల్లల కోసం భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రత్యేక అవసరాలుగల పిల్లలను వాటిలో చేర్పించాలని పేర్కొన్నారు. బడి బయట ఉన్న ఒకరిని, ప్రత్యేక అవసరాలు కలిగి ఉన్న వారిని గుర్తించి, వారి పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కా ర్యక్రమంలో ఐఈఆర్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.