గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో ముఖ్యమంత్రి సహాయ నిథి అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని క్యాంపుకార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
బాగ్అంబర్పేట గంగాబౌలికి చెందిన జాఖీర్ అహ్మద్కు రూ. 42వేలు, రంగారెడ్డి జిల్లా సరూర్నగర్కు చెందిన సత్య నారాయణకు రూ. 41వేలు, అంబర్పేట ప్రేమ్నగర్కు చెందిన జ్ఞానేశ్వర్కు రూ.53వేలు, అంబర్పేట ప్రేమ్నగర్కు చెందిన చంద్రశేఖర్రెడ్డికి రూ.40వేలు, గోల్నాక శాంతినగర్కు చెందిన ప్రదీప్కు రూ.58వేలు ఎమ్మెల్యే అందజేశారు.
అలాగే కాచిగూడకు చెందిన మహాలక్ష్మికి రూ. 32వేలు, గోల్నాక జైస్వాల్గార్డెన్కు చెందిన శ్రీధర్కు రూ.60వేలు, నల్లగొండ జిల్లా వలిగొండకు చెందిన నవీన్కు రూ.32వేలు, కాచిగూడ నింబోలిఅడ్డకు చెందిన సంతోష్కు రూ. 60వేలు, అంబర్పేట అశోక్నగర్కు చెందిన ప్రవీణకు రూ.1లక్షా50వేల విలువగల చెక్కులను కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.