కాచిగూడ : అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జీఆర్పీ పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడ రైల్వేస్టేషన్లోని టీస్టాల్, న్యూస్ పేపర్ స్టాల్, హోటల్స్, కాఫీషాపుల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వేస్టేషన్లో అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసుల కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను షాపు నిర్వాహకులు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైల్వే భధ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, రైల్వే ప్రయాణికులను సురక్షీతంగా వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటు న్నట్లు ఆయన తెలిపారు.
రైల్వేస్టేషన్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతిరోజు రైళ్లలో సిబ్బందితో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు నిర్భయంగా రైల్లలో ప్రయాణాలు చేయవచ్చునని ఇన్స్పెక్టర్ బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.