పహాడీషరీఫ్: విద్యార్థులను మదర్సా నిర్వహకులు గాయపరిచిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రాయణగుట్టకు చెందిన మతన్ బిన్ జావిద్ అల్ జాబ్రీ అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులైన ఉస్మాన్ బిన్ మతిన్ అల్ జాబ్రీ(8), హసన్ బిన్ మతిన్ అల్ జాబ్రీ(6) ఇద్దరిని అరబిక్ నేర్చుకోవడానికి బాలపూర్ పోలీస్స్టేషన్పరిధి న్యూ బాబానగర్లోని బెహరుల్ ఉలుమ్ మదర్సాలో చేర్పించాడు.
జావిద్ అల్ జాబ్రీ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమారులను కలవడానికి మదర్సా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఆయనకు తమను మదర్సా నిర్వహకులు అబ్దుల్ రహిం, అఖిల్లు కొట్టి గాయపరిచారని కుమారులు తెలిపారు. కాగా తన కుమారులను గాయపరిచిన మదర్సా నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాబ్రీ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.