బంజారాహిల్స్ : అర్థరాత్రి దాకా పబ్ను నిర్వహించడంతో పాటు భారీ శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ను కలిగిస్తున్న పబ్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్బక్స్ భవనంపైన ప్లై లాంజ్ క్లబ్ పేరుతో నడుస్తున్నది.
పబ్లో ఆదివారం అర్థరాత్రి సమయంలో భారీ సౌండ్స్తో మ్యూజిక్ను పెట్టడంతో పాటు న్యూసెన్స్కు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్ యజమాని అభిషేక్ అగర్వాల్, మేనేజర్ శ్రీరామ్లపై కేసు నమోదు చేశారు.